Saturday, April 20, 2024
- Advertisement -

మంచు మ‌నోజ్‌ను ‘వెద‌వ’ అనేశారుగా..!

- Advertisement -

తెలుగు హీరోల్లో సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరో మంచు మ‌నోజ్‌. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాజంలో జ‌రుగుతున్న వాటిపై స్పందిస్తు కామెంట్స్ చేస్తుంటారు. గ‌త కొంత‌కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో మాత్రం అభిమానుల‌తో ట‌చ్‌లోనే ఉంటున్నాడు. తాజాగా ఆయ‌న‌ను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశాడు నెటిజ‌న్‌. నిన్న‌(ఆదివారం) మోదీ ఏపీలో పర్యటన‌ నేపధ్యంలో మనోజ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మీరు ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి వస్తున్నారా? లేక ఇక్కడి జనాల సమస్యలు చూడడానికి వస్తున్నారా ? అంటూ ట్వీట్ చేశాడు మ‌నోజ్‌. దీనిపై ఓ నెటిజ‌న్ ఘాటుగానే స్పందించాడు.

ముందు కేంద్రం ఇచ్చిన ఐదు లక్షల కోట్లను ఎలా ఖర్చు పెట్టాడో నారా చంద్రబాబు నాయుడిని అడుగు. అంత దమ్ము ఉందా.. క్యాస్టియెస్ట్ ఇడియట్ అంటూ తిట్టాడు. దీనిపై మంచు మ‌నోజ్ కూల్‌గా స‌మాధానం ఇచ్చాడు. పేరు చివ‌ర‌న క్యాస్ట్ పెట్టుకుందా నువ్వ నేనా అన్నా అంటూ త‌న స్టైల్లో కౌంట‌ర్ ఇచ్చాడు. ఐ యామ్ నిలదీస్ఫైయింగ్ యు కూల్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశాడు. త‌న‌ను వెద‌వ అని తిట్టిన‌ప్ప‌టికి అత‌నిపై కోపం ప్ర‌ద‌ర్శంచ‌కుండ జ‌వాబు ఇవ్వ‌డంతో అతనిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -