- Advertisement -
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఈ రోజు మధ్యాహ్నం(గురువారం) తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని సమాచారం.మణిరత్నం అస్వస్థతకు గురైన వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మణిరత్నానికి గుండెపోటు వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఆయన త్వరగా కోలుకోని క్షేమంగా తిరిగి రావలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక మణిరత్నం తమిళ ఇండస్ట్రీ చెందిన వ్యక్తి అయినప్పటికి ఆయన తీసిన సినిమాలు ద్వారా తెలుగు,హింది బాషాలలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.మణిరత్నం సతీమణి ప్రముఖ తెలుగు సినీనటి సుహాసిని అన్న సంగతి తెలిసిందే. మణిరత్నం వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు.