Wednesday, April 24, 2024
- Advertisement -

మణిరత్నం సినిమాలో ఏకంగా 12 పాటలు

- Advertisement -

గత కొంతకాలంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. హిస్టారికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను వెచ్చించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటిదాకా దాదాపు అన్ని సినిమాలలో 5 లేదా 6 పాటలు ఉంటాయి కానీ ఈ సినిమాలో ఏకంగా 12 పాటలు ఉండబోతున్నాయట.

చాలా కాలం తరువాత ఆస్కార్ గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ మణిరత్నం దర్శకత్వంలో సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నారు.ఏ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా 2 పార్టులుగా విడుదల కాబోతోందని సమాచారం. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, మోహన్ బాబు, నయనతార, కీర్తి సురేష్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -