Wednesday, April 24, 2024
- Advertisement -

‘హే మెనీన’ అంటున్న నాగ్

- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా మారిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట ‘హే మెనీన’ ఇవాళ విడుదలైంది. పోర్చుగీస్ లో మెనీన అంటే అమ్మాయి అని అర్థం. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా కి అద్భుతమైన మ్యూజిక్ అందించిన చైతన్ భరధ్వాజ్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు.

శుభం విశ్వనాధ్ లిరిక్స్ చాలా బాగున్నాయి. చైతన్ గొంతు ఎనర్జిటిక్గా ఉండటంతోపాటు పాటకి చాలా బాగా సెట్ అయ్యింది. సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై నాగార్జున అక్కినేని, వయా కామ్ 18 మోషన్ పిక్చర్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్, సమంత అక్కినేని, అక్షర గౌడ గెస్ట్ పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది. ‘మన్మధుడు’ సినిమా లాగానే ‘మన్మధుడు 2’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -