Tuesday, April 23, 2024
- Advertisement -

మన్మధుడు ఇక హైదరాబాద్ లో పాగా వేయనున్నాడు

- Advertisement -

నాగార్జున అక్కినేని కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిలిచే చిత్రం మన్మధుడు. విజయ్ భాస్కర్ దర్శకత్వం లో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా విడుదల అయిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సోనాలీ బింద్రే, అన్షు ఈ సినిమా లో హీరోయిన్లు గా నటించారు. అయితే తాజాగా ఈ సినిమా కి రెండో భాగం గా వస్తున్న మన్మధుడు 2 సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అక్కడ నుండి పారిస్ వెళ్ళి అక్కడ కొన్ని ముఖ్యమైన సీన్లు తీస్తున్నట్లు చిత్ర యూనిట్ నుండి సమాచారం.

అయితే అక్కడ షూట్ ముగిసిన అనంతరం వెంటనే హైదరాబాద్ వచ్చి ఇక్కడ 21 నుండి సినిమా కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టె దిశగా చిత్ర వర్గాలు ఆలోచన చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో మొదలైంది. ఇక ఫారిన్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ మిగిలిన భాగాన్ని హైదరాబాద్ లో పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్, అక్షర గౌడా హీరోయిన్లు గా నటిస్తున్నారు. నాగార్జున తో పాటు జెమినీ కిరణ్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా కి దర్శకుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -