Wednesday, April 24, 2024
- Advertisement -

‘మన్మధుడు 2’ నుంచి మెలోడియస్ పాట

- Advertisement -

2002లో నాగార్జున హీరోగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమా తెరకెక్కనుంది. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, లక్ష్మీ, దేవదర్శిని, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా సినిమా నుండి ‘హే మనీనా’ అనే మొదటిపాట విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమాలోని రెండవ పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

సినిమా నుంచి ‘నాలోన’ అనే పాటని ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకి విడుదల చేశారు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటి పాటతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న చైతన్ ఈ పాటతో కూడా అందరినీ మెప్పిస్తున్నాడు. స్లో గా సాగే ఈ పాటలో చిన్మయి శ్రీపాద గొంతు మరింత వినసొంపుగా ఉంది. శుభం విశ్వనాధ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున, వయోకామ్ 18 మోషన్ పిక్చర్స్ మరియు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 9న విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -