టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ రచ్చ చేస్తున్న హీరోయిన్ తాప్సీ.తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికి సరైన హిట్లు లేక బాలీవుడ్ బాట పట్టింది.అక్కడ ఈ అమ్మడికి వరస అవకాశాలు రావడంతో ఫుల్ బిజీగా మారింది.అయితే తాప్సీ ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికి వాటిపై పెద్దగా స్పందించలేదు తాప్సీ.అయితే తాజాగా తాప్సీకి నిశ్చితార్ధం జరిగిందనే వార్తలు వినపడుతున్నాయి. డెన్మార్క్ బ్యాండ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్ తో తాప్సీ ప్రేమలో ఉందనే వార్తలు బాగా వినిపించాయి.
వారిద్దరూ ముంబైలో ఓ హోటల్ లో డిన్నర్ చేసి ఒకరి చేతులు మరొకరు పట్టుకొని బయటకు రావడంతో వార్తలు గుప్పుమన్నాయి. మాథ్యూస్ ఆడే టోర్నమెంట్ కు తాప్సీ వెళ్లడం అతడిని ఎంకరేజ్ చేయడం వంటివి చేస్తుంటుంది. ఈ విషయంపై మాథ్యూస్ కు మీడియాలో ప్రశ్నలు ఎదురవ్వగా.. అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని కామెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు.తాజాగా తాప్సీ, మాథ్యూస్ తో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ కొందరు బంధువుల సమక్షంలో నిశ్చితార్ధం జరుపుకున్నారని టాక్.మరి తాప్సీ నిశ్చితార్థంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.