Friday, March 29, 2024
- Advertisement -

మారుతి పై ఎట్టకేలకు కురుస్తున్న ‘సిరివెన్నెల’

- Advertisement -

దర్శకుడు మారుతి ఈ రోజుల్లో అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టాడు. ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు చేసాడు. స్టార్డం కూడా సంపాదించాడు కానీ మారుతీ కెరీర్ లో మాత్రం ఎత్తు పల్లాలు మాత్రం అస్సలు తగ్గలేదు. ఈయన చేసిన చివరి చిత్రం శైలజ రెడ్డి అల్లుడు కూడా బోల్తాపడటం తో సాయి ధరమ్ తేజ్ తో ఒక కొత్త చిత్రం చేస్తున్నాడు. ప్రతి రోజు పండగే అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా లో ఒక కీలకమైన పాట కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి ని సంప్రదించారట. అయితే మారుతి ఎప్పటి నుంచో ఆయన తో పని చేయాలి అని అనుకుంటున్నారట కానీ ఎందుకో కుదరడం లేదట.

ఇకపోతే మొత్తానికి ఈ సినిమా కోసం, తను ఆల్రెడీ షూట్ చేసిన కొన్ని సన్నివేశాలని కూడా సిరివెన్నెల కి చూపించి, అతని ప్రశంసలు పొంది, చివరికి ఆయన తో పాట రాయించడానికి ఓకే చెప్పించుకున్నారట. ఈ సినిమా ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నారు. రావు రమేష్ మరియు సత్యరాజ్ ఈ సినిమా లో ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.

కుటుంబ కథా చిత్రం గా రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -