Thursday, April 25, 2024
- Advertisement -

క‌మెడియ‌న్ పృథ్వీకి వార్నింగ్ ఇచ్చిన నాగ‌బాబు

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గ‌త‌కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. నా ఛానెల్ నా ఇష్టం అనే యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టి ఏపీ రాజ‌కీయా నాయ‌కుల మీద సెటైర్స్ వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వైసీపీ కార్య‌ద‌ర్శి, క‌మెడియ‌న్ పృథ్వీకి వార్నింగ్ ఇచ్చారు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో ఆయ‌న మాట్లాడుతు త‌మ కుటుంబం, ప‌వ‌న్ రాజ‌కీయ‌ల‌పై స్పందించారు. దీనిలో భాగంగానే యాంక‌ర్ అడిగిన ప్రశ్న‌కు సమాధానంగా పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు. ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీకి నాగ‌బాబు , ఆయన త‌న‌యుడు వ‌రుణ్ తేజ్‌లు విరాళాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నాగబాబు 25 ల‌క్షలు, వ‌రుణ్ తేజ్ కోటి రూపాయిలు విరాళాలు ఇచ్చారు. అయితే ఈ డబ్బు ప్యాకేజి ద్వారా వ‌చ్చింద‌ని విమ‌ర్శ‌లు చేశారు న‌టుడు పృథ్వీ.

దీనిని ప్ర‌స్తావిస్తు యాంక‌ర్ ఆ డబ్బు ప్యాకేజి ద్వారా వ‌చ్చిన డ‌బ్బును మీరు విరాళంగా జ‌న‌సేన పార్టీకి ఇచ్చార‌ట క‌దా అని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మీకు ఎవ‌రైనా చెప్పారా అంటూ కాస్తా అగ్ర‌హాంగానే యాంక‌ర్‌ను అడిగాడు నాగ‌బాబు. దీనికి మీ ఇండ‌స్ట్రీకి చెందిన క‌మెడియ‌న్ పృథ్వీనే ఇలా కామెంట్ చేశార‌ని చెప్ప‌డంతో,ఆయ‌న ఓరేయ్ పృద్వీ నాకు ఫోన్ చేయ్ నీకు స‌మాధానం చెబుతానంటూ అతనికి వార్నింగ్ ఇచ్చాడు. పృద్వీ నా ఫోన్ నెంబ‌ర్ నీ దగ్గ‌ర ఉంది కాల్ చేయి, ఈ ప్ర‌శ్న‌కు నేనే నీకు స‌మాధానం చెబుతానంటూ పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు నాగ‌బాబు. మొత్త‌నికి త‌మ్ముడు ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ కోసం నాగ‌బాబు తెగ క‌ష్ట‌ప‌డిపోతున్నాడ‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -