మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్లతో మంచి జోష్లో ఉన్నాడు.అయితే వరుణ్ విలన్గా కనిపించనున్నాడు అని సమాచారం.ప్రస్తుతం టాలీవుడ్లో విలన్ రోల్స్కి మంచి ఆదరణ ఉంది.’జై లవకుశ’ సినిమా ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. హీరో రానా, ఆది పినిశెట్టి వంటి నటులు విలన్గా కనిపించి మెప్పించారు.ఇప్పుడు మెగాహీరో వరుణ్ తేజ్ కూడా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.వరుణ్ తేజ్ని విలన్ గా పరిచయం చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.తమిళంలో ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘జిగర్తండ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఒరిజినల్ కథలో సిద్ధార్థ్ హీరోగా నటించగా.. విలన్ గా బాబీ సింహా కనిపించారు. అయితే హీరో కంటే విలన్ పాత్రకే ఎక్కువ పేరొచ్చింది.ఇప్పుడు తెలుగులో హీరో పాత్రని కాస్త డౌన్ చేసి ప్రతినాయకుడి పాత్రని మరింత హైప్ చేయాలని చూస్తున్నారట. ఆ పాత్ర కోసం వరుణ్ తేజ్ ని సంప్రదించినట్లు సమాచారం. వరుణ్ నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. విలన్గా వరుణ్ తేజ్ ఓకే అయితే హీరోగా ఎవరు చేస్తారో చూడాలి.