Saturday, April 20, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం రంగంలోకి దిగిన మెగా హీరోలు

- Advertisement -

న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ పెట్టి 5 సంవ‌త్స‌రాలు అయింది. అయితే ఆయ‌న 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపారు. 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించాడు. దీనికి త‌గిన‌ట్లుగానే ప‌వ‌న్ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌కటించాడు. తాను కూడా రెండు నియోజిక వ‌ర్గాలు నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌కటించాడు.

భీమ‌వ‌రం, గాజువాక నియోజిక వ‌ర్గాల నుంచి ఆయ‌న పోటీ చేస్తున్నారు. ప‌వ‌న్ మొద‌టి నుంచి కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌రువాత కూడా ప‌వ‌న్ వారి కుటుంబానికి దూరంగానే ఉన్నాడు. కాని ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మయంలో ప‌వ‌న్‌కు మెగా ఫ్యామిలీ అండ‌గా నిలిచింది. ఇటీవ‌లే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పార్టీలో చేర‌డ‌మే కాదు, పార్టీ త‌రుపున న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా పోటీలో నిల‌బెట్టారు ప‌వ‌న్‌.

ఇప్పుడు మెగా హీరోలు కూడా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. నిన్ననే వ‌రుణ్ తేజ్ మా బాబాయ్‌కు కావ‌లంటే ఎటువంటి స‌హయం చేయ‌డానికి అయిన రెడీ ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రో మెగా హీరో ప‌వ‌న్‌కు స‌పోర్ట్ చేశాడు. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప‌వ‌న్ పార్టీ గుర్తు గ్లాస్‌ను ప‌ట్టుకుని ఓ ఫోజు ఇచ్చాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్ర లహరి సినిమాలో గ్లాస్‌మేట్స్‌ అనే సాంగ్ ఉంది. ఆదివారం సాయంత్రం 7గంటలకు పాటను రిలీజ్ చేయనున్నారు. అయితే పోస్టర్ లో సేమ్ జనసేన గాజు గుర్తును ఉంచిన సాయి ఇన్ డైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -