Saturday, April 20, 2024
- Advertisement -

గుళ్ళు, గోపురాలు తిరుగుతున్న చిరంజీవి

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ఇటీవలే తన తదుపరి చిత్రం సై రా నరసింహా రెడ్డి సినిమా కి సంబందించిన షూటింగ్ ని డబ్బింగ్ ని దిగ్విజయం గా పూర్తి చేసుకొని ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నాడు. తీరిక లేకుండా సినిమా షూటింగ్ లో పాల్గొని అలిసిపోయిన చిరంజీవి ఇప్పుడు గుళ్ళు, గోపురాలు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఆయన మొన్నీ మధ్యనే విజయవాడ లో ని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. తన భార్య సురేఖ తో పాటు చిరంజీవి అమ్మవారిని దర్శించుకున్నారు.

అంతే కాకుండా ఇప్పుడు కుటుంబం తో సహా వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామి ని కూడా దర్శించుకోవాలని ఆలోచన లో ఉన్నారట. సడన్ గా ఈ ఆధ్యాత్మిక ట్రిప్స్ ఎందుకు వేస్తున్నారో తెలియదు కానీ చిరంజీవి మాత్రం కాస్త తన మైండ్ ని, బాడీ ని ప్రశాంతం గా ఉంచుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీ ని సంపాదించడానికి ఇలా చేస్తున్నారు అని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

సై రా విడుదల కాగానే చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -