Saturday, April 20, 2024
- Advertisement -

తల్లిని ఒంటరిగా ఉంచడానికి కారణం చెప్పిన మెగాస్టార్..!

- Advertisement -

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. ఎంతో మంచి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇంతపెద్ద స్టార్‍డమ్ ఉన్నప్పటికి ఒదిగి ఉండే మనస్తత్వం చిరంజీవిది. రాజకీయపరంగా పెద్దగా కలిసిరాలేదు. రాజకీయాల్లో విమర్శలు ఎదుర్కున్నారు తప్పిస్తే మిగిత ఎక్కడ ఆయనకు విమర్శలు ఎదురవ్వాలేదు. అయితే ఆయన ఓ సందర్భంలో తన తల్లి అంజనా దేవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

’ఓ మాములు కానిస్టేబుల్ భార్య ఎలా ఉంటుందో మా అమ్మ ఇప్పటికి అలానే ఉంటుంది. ఆమె కొడుకులుగా మేము ఎంతో స్థాయికి చేరుకున్నాం. నేను, తమ్ముళ్లు, చెల్లెల్లు అర్ధికంగా బాగా స్థిరపడ్డాం. కానీ మా అమ్మ మాత్రం ఇప్పటికి సాధరణ గృహిణిలాగే ఉంటుంది. కొంతకాలంగా మా అమ్మ విడిగా ఉంటుంది. అయితే ఈ విషయంపై రకరకల కారణాలు ప్రచారం జరిగాయి. అలాంటి వాటిలో ఎలాంటి నిజాలు లేవు. ఇంటి మార్పులు కారణం చేత.. అమ్మ వేరే ఇంట్లో ఉంటానని అంది.

అందుకే అమ్మను వేరే ఇంట్లో ఉంచాం. మరల అమ్మ మా ఇంటిని వచ్చేసింది. ఒంటరిగా ఉండలేకపోతున్నా అని చెప్పగానే చిన్న పిల్లవాడిలా సంబరపడిపోయాను. అమ్మ వేరే ఇంటికి వెళ్తాను అన్నప్పుడు ఆమె నిర్ణయాన్ని గౌరవించాను. ఇప్పుడు తిరిగి వస్తాను అనగానే అంతకన్నా ఎక్కువగా గౌరంచి.. సంతోషించాను’ అని చిరు చెప్పారు. చిరంజీవి తన తల్లిని ఎంత ప్రేమిస్తారో దీని బట్టే తెలుస్తోంది. అందుకే మెగాస్టార్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -