Wednesday, April 24, 2024
- Advertisement -

చెర్రీ, ఉపాసన పిల్లల కనకపోవడంపై చిరు కామెంట్స్..!

- Advertisement -

మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలంటే డబ్బుతో పాటు బంధాలు కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఉంటేనే మనిషి జీవితంలో మధుర స్మృతులు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లై కొడుకు-కూతరు పెళ్లిళ్లు చేసిన తరువాత మనవల్లు-మనవరాల్లతో ఆడుకోవాలని ప్రతి తండ్రికి ఉంటుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన కూతుళ్ల బిడ్డలతో తాత అని అనిపించుకున్నప్పటికీ నిజమైన వారసుడు కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్-ఉపాసనలు పెళ్లి చేసుకుని జూన్ 14 వస్తే ఎనిమిదేళ్లు అవుతోంది. 2012లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు పిల్లలు లేరు. అయితే రామ్ చరణ్-ఉపాసనల పెళ్లి, పిల్లలు అనేది వారి పర్శనల్ విషయాలు కాబట్టి.. వారిదే తుది నిర్ణయం. అయితే తనకూ నిజమైన వారసుడు-వారసురాలు ఉండాలని.. తాత కావాలని ఉంటుందిగా అంటూ మనసులో కోరికను బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

తాజాగా ఇదే విషయంపై చిరంజీవి మాట్లాడుతూ.. “నిజమైన వారసుడ్ని ఎత్తుకోవాలని నాకూ ఉంది. నా భార్య సురేఖ.. చరణ్-ఉపాసనలను అడుగుతూనే ఉంది. కాని వాళ్ల పిల్లల ప్లానింగ్ ఏంటో మాకూ అర్థం కావడం లేదు. అది వాళ్ల పర్శనల్ విషయం.. అందులో మనం ఎంత వరకూ చెప్పాలో అంతవరకే చెప్పగలం. తరువాత వాళ్ల ఇష్టం. పిల్లల్ని కనొచ్చుగా అంటే… ఏదో ప్లానింగ్ అంటుంటారు. అదేం ప్లానింగో తెలియదు. అది వాళ్ల ఇష్టం’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -