Friday, March 29, 2024
- Advertisement -

పంజాబి భామ యాపిల్ పండును చూశారా…

- Advertisement -

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్.. తన కొడుకును హీరోగా ఎంట్రీ చేయించడం కోసం పడుతోన్న కష్టం అంతా ఇంతకాదు. ఆకాష్ పూరీ నటిస్తున్న “మెహబూబా” చిత్రం షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. ఇక్కడ షూటింగ్ ఏం చేస్తున్నారో తెలియదు గాని… బ్రేకప్ టైం లో మాత్రం యూనిట్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.

మరీ ముఖ్యంగా… పూరీ ఆయన వెంటే ఛార్మి… దాదాపు ప్రతి రోజుకో కొత్త ఫోటోను తమ ట్విటర్లలో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు థ్రిల్ అందిస్తున్నారు. లేటెస్ట్ గా వీరు అత్యంత అరుదుగా లభించే జపానీ యాపిల్ ని వీళ్ళు తింటూ ఆ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ తరహా యాపిల్ దేశంలో మరెక్కడా దొరకదట. గడ్డ కట్టే చలిలో స్వెటర్లు, మంకీ టోపీలు ధరించి ఈ పండు తింటూ దీని విశేషాలను ఛార్మింగ్ గాళ్ వివరించి మరీ చెబుతుంది.

మెహబూబాషూటింగ్ స్పాట్ లో పూరీ మొదట ఓ కుక్కను ఆప్యాయంగా నిమురుతున్న ఫొటో ఒకటి బయట పడగా, ఆ తరువాత ఓ జడల బర్రె ఫోటో తీసి పోస్ట్ చేసిన ఛార్మి….” క్యూటీ ” అంటూ దానికో ట్యాగ్ లైన్ కూడా తగిలించింది. ఇప్పేడేమో ఇలా అతి అరుదైన ” యాపిల్ ” టేస్ట్ గురించి తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే అంటూ పోస్ట్ పెట్టింది.

ఆ వీడియోపై మీరు ఒక లుక్కేయండి….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -