Friday, March 29, 2024
- Advertisement -

బెల్లంకొండ ఖ‌ర్చుకు వెన‌కాడ‌టం లేదుగా..!

- Advertisement -

అల్లుడు శీనుతో హీరోగా ప‌రిచియ‌మైయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఈ సినిమాతో ఫ‌ర్వాలేద‌నిపించుకున్నాడు బెల్లంకొండ. త‌రువాత న‌మోడి న‌టించిన సినిమాలు పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీనుతో తీసిన జ‌య జానికి నాయక సినిమా కూడా బెల్లంకొండ‌కు విజ‌యం సాధించిపెట్ట‌లేక‌పోయింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన సాక్ష్యం సినిమా కూడా ఫెయిల్ అయింది. ఈ సినిమాను 40 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించార‌ని అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి సినిమా బడ్జెట్ తక్కువగానే ఉండొచ్చని చెప్పుకున్నారు.

కానీ ఆయన తాజా చిత్రానికి కూడా బాగానే ఖర్చు చేస్తున్నారనేది తాజా సమాచారం. శ్రీనివాస్ తాజా చిత్రం .. తేజ దర్శకత్వంలో రూపొందుతోంది. మెహ్రీన్ .. కాజల్ ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాంబోడియాలో జరుగుతోంది.. ఇప్పటికే ఈ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ దాటిపోయిందట. అయినా నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకపోవడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. మ‌రి మార్కెట్ క‌న్నా బడ్టెట్ ఎక్కువ అయితే సినిమా అయిన పెద్ద‌గా లాభాలు ఉండ‌వ‌ని ఈ నిర్మాత‌లు ఎప్పుడు తెలుసుకుంటారో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -