Wednesday, April 24, 2024
- Advertisement -

నా భర్త వల్ల నష్టపోయాయను : రోజా కామెంట్స్

- Advertisement -

రోజా సెల్వమణి గురించి ప్రత్యేకింగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది బాషల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా మంచి కెరీర్ కొనసాగుతున్నప్పుడే ఆర్కె సెల్వమణిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. కానీ టీవీ ప్రోగ్రాంల ద్వారా అభిమానులకు మళ్లీ దగ్గరైంది. రోజా కొన్ని రియాల్టీ షోలతో బిబీబిజీగా ఉంటూనే రాజకీయంగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న రోజా.. తన భర్త కారణంగా ఓ సందర్భంలో పూర్తిగా నష్టపోయానని సంచలన వ్యాఖ్యలు చేసింది. సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పాడట. రోజా తండ్రిని ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి. ఇక రోజా కూడా సెల్వమణి ప్రేమకోసం బాగానే కష్టపడిందట. ఆయన కోసం తమిళం బాష మాట్లాడటం చదవడం కూడా నేర్చుకుందట. చివరకు ప్రేమించిన దర్శకుడినే పెళ్లాడి.. లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. అయితే 1994లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ సినిమాను రోజా నిర్మించింది.

అందులో హీరోహీరోయిన్లగా సుమన్ రోజా తదితరులు నటించారు. ఇక ఈ సినిమాను రోజా భర్త ఆర్కె సెల్వమణి తెరకెక్కించాడు. ఇళయరాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా దెబ్బతో రోజాకు ఆర్థికంగా కుదేలైంది. అలా తన భర్త తీసిన సినిమా వల్ల నేను ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నానని రోజా తెలిపింది. ప్రస్తుతం రోజా దంపతులు తమ పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. తన భర్త వల్లే నష్టపోయాయను అనడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -