Saturday, April 20, 2024
- Advertisement -

సమంత ను అలా చూడగానే షాకాయ్యా : మురళీ మోహన్

- Advertisement -

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ ఎవరంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది సమంత-నాగచైతన్య. ఈ జంట గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జయభేరి సంస్థ ఆధ్వర్యంలో మురళీ మోహన్ కు భూములు, వెంచర్లు ఉన్నాయి. తాజాగా ఆయన సొంత అవసరాల కోసం హైదరాబాద్ లోని ఓ ఏరియాలో 14వ అంతస్థులో స్విమ్మింగ్ ఫూల్ – జిమ్ తోపాటు అన్ని సౌకర్యాలతో మూడు ఇల్లులు కట్టించాడు.

ఆయన కుటుంబానికి అవసరమయ్యేలా వీటిని తయారు చేశారు. అయితే ఆ ఇల్లు హీరో నాగచైతన్యకు నచ్చడంతో ఒక ఇల్లు అమ్మమని మురళీ మోహన్ ను అడిగాడట. అందుకు తాను కుదరదని.. ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అని చెప్పాడట. దీంతో నాగార్జునతో ఫోన్ చేయించి మురళీ మోహన్ ను కన్విన్స్ చేసి నాగచైతన్య ఎట్టకేలకు ఆ ఇంటిని కొనేశాడు. దీంతో నాగ్ ఫోన్ తో అమ్మేశానని మురళీ మోహన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పక్కపక్క ఇళ్లలో ఉండే మేము – నాగచైతన్య-సమంతలు తరచూ కలిసేవారని.. పలకరించుకునే వాళ్లమని మురళీ మోహన్ తెలిపారు.

తాను ఓ రోజు జిమ్ చేస్తుండగా.. సమంత వచ్చిందని.. ఆమె అంత సన్నగా ఉన్నా.. బరువులు ఎత్తేస్తుంటే చూసి షాకయ్యానని మురళీ మోహన్ తెలిపాడు. ఆమె చాలా ప్రొఫెషనల్ అమ్మాయి.. అంత కసరత్తులు ఎవరు చేయలేరని సమంత గురించి గొప్పగా చెప్పాడు మురళీ మోహన్. ఆమెకు వృత్తి పట్ల నిబద్దత చాలా ఎక్కువ అని కొనియాడారు. ఇక చేతు ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -