Friday, March 29, 2024
- Advertisement -

కాశ్మీర్ లోయలో షూట్ చేయనున్ను నాగ్ అశ్విన్

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సారి దర్శకుడు నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమా ని కాశ్మీర్ వాలీ లో షూట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయమై ప్రమేషన్స్ కోరుతూ నిర్మాత అశ్విని దత్, తన కుమార్తె మరియు అల్లుడు నాగ్ అశ్విన్ తో కలిసి యూనియన్ మినిష్టర్ జోషి ప్రహ్లాద్ ని కలిశారు.జోషి ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాలు చూడటమే కాకుండా బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ ని కూడా చూసుకుంటున్నారు.

అయితే ఆయన వీళ్ళ తో ముచ్చటించి, ఆర్టికల్ 370 ని రద్దు చేసినట్లు మరలా తెలిపి కాశ్మీర్ లోయలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా షూట్ చేసుకోవచ్చు అని వారిని కోరారు. ఒకప్పటి లాగా పరిస్థితులు లేవని చెప్తూ హ్యాపీ గా తమ సినిమా షూటింగ్ ని చేసుకోండి అని ఆయన సెలవిచ్చారు.

ఇకపోతే నాగ్ అశ్విన్ తదుపరి సినిమా పైన క్లారిటీ లేదు. కొంత మంది ఆయన విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు అని చెప్తున్నారు కానీ అసలు విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -