Wednesday, April 24, 2024
- Advertisement -

మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న అక్కినేని బ్రదర్స్

- Advertisement -

అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య మరియు అఖిల్ కలిసి ‘మనం’ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమాలో అఖిల్ కేవలం గెస్ట్ పాత్రలో కనిపిస్తాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ అన్నాతమ్ముళ్ళు ఇప్పుడు ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళ హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించనుంది. టాలీవుడ్ లోని ఒక ప్రముఖ దర్శకుడు ఈ మధ్యనే కింగ్ నాగార్జున కి ఒక కథ చెప్పాడట. ఆ కథ విపరీతంగా నచ్చడంతో నాగార్జున తన కొడుకులిద్దర్నీ ఆ సినిమాలో హీరోలుగా పెట్టాలని నిర్ణయించుకున్నారు అని సమాచారం.

అయితే ఈ మధ్యనే ‘మజిలీ’ సినిమాతో హిట్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం ‘వెంకీమామ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నాగచైతన్య మరియు విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. మరోవైపు వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక నాగచైతన్య మరియు అఖిల్ కలిసి సినిమా చేశారంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -