శైలజా రెడ్డి అల్లుడుతో హిట్ కొట్టిన నాగచైతన్య తన తరువాత సినిమా సవ్యసాచిని లైన్లో పెట్టాడు.చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. “ఒక్కరంటే ఒక్కరు .. ఇద్దరంటే ఇద్దరు .. ఒక తనువును ఎదిగిన కవలలు .. ఒక తీరున కదలని తలపులు .. ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు .. అమ్మకదే పదివేలు” అంటూ ఈ పాట కొనసాగుతోంది.ఒకే తనువుగా కలిగిన తన కవల పిల్లల గురించి ఒక తల్లి పాడే పాటగా ఇది కొనసాగుతోంది. “నా కలలకు రెక్కలు మీరు .. నా ఎనిమిది దిక్కులు మీరు” అంటూ తన పిల్లల గురించి ఓ తల్లి ఆవిష్కరించిన భావజాలం అద్భుతమనే చెప్పాలి.
ఈ అక్షరాలు తల్లి హృదయాన్ని తట్టిలేపేలా వున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చాలా బాగుంది .. ఇక కీరవాణి బాణీల్లోని బలం ఎంతమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించేలా ఈ పాట ఉంది.ఇప్పటికే విడుదల అయిన టీజర్కు మంచి స్పందన వచ్చింది.నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఓ కీలక పాత్రలో నటిస్తుంది.ఒకప్పటి రొమాంటిక్ హీరో మాధవన్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు.సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.సినిమాను దీపావళికి విడుదల చేసే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.