Saturday, April 20, 2024
- Advertisement -

త‌న స్వార్థం కోసం జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్‌ల‌ను వాడుకుంటున్న నాగ‌బాబు

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలోర‌చ్చ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం నాగ‌బాబు తెగ క‌ష్ట‌ప‌డిపోతున్నారు. కొద్ది రోజులుగా నాగ‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు.గ‌తంలో బాల‌య్య‌పై కామెంట్స్ చేసిన నాగ‌బాబు, ఇటివ‌లే ఆయ‌న ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి , దానిలో పొలిటిక‌ల్ సెటైర్స్ వేస్తున్నాడు. ముఖ్యంగా ఏపీ రాజ‌కీయాల‌పై, అక్క‌డి నాయ‌క‌ల‌పై పొలిటిక‌ల్ కామెంట్స్ చేస్తున్నాడు నాగ‌బాబు. జ‌గ‌న్, లోకేశ్‌, చంద్ర‌బాబుల‌పై కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచారు నాగ‌బాబు. తాజాగా ఆయ‌న మ‌రోసారి త‌న నోటికి ప‌ని చెప్పారు. ప‌రోక్షంగా ఏపీలోని పార్టీల‌పై కామెంట్స్ చేశారు నాగ‌బాబు. ఇద్ద‌రు జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్‌ల‌ను తీసుకువ‌చ్చి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనిపించాడు.

నువ్వు ల‌క్ష‌ల కోట్లు తిన్నావ్‌.. నువ్వు రెండు ల‌క్ష‌ల కోట్లు తిన్నావ్ అంటూ వారి చేత చిన్న స్కిట్ వేయించాడు. మీరిద్ద‌రిలో ఎవ‌రు ఎక్కువ తిన్నారో చెబితే వారికి చాక్లెట్ ఇస్తాన‌ని చెప్ప‌డంతో వారిద్ద‌రి ఒక‌రిపై మ‌రోక‌రు కామెంట్స్ చేసుకోవ‌డం మ‌నం ఈ వీడియో చూడ‌వచ్చు. అయితే నాగ‌బాబు త‌న త‌మ్ముడు కోసం ఇలాంటివి చేయ‌డంలో త‌ప్పు లేదు కాని, ఇలా త‌న స్వార్థం కోసం జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్‌ల‌ను వాడుకోవ‌డాన్ని చాలామంది త‌ప్పు ప‌డుతున్నారు. త‌న షోలోని ఆర్టిస్ట్‌ల‌ను ఇలా త‌న అవ‌స‌రాల కోసం వాడుకోవాడంపై మండిప‌డుతున్నారు. ఒక‌వేశ వారు చేయ‌నంటే, వారికి జ‌బ‌ర్ద‌స్త్‌లో అవ‌కాశం లేకుండా ఇలా చేస్తార‌ని భ‌యంతోనే ఈ స్కిట్‌లో జ‌బ‌ర్ట‌స్త్ ఆర్టిస్ట్‌లు న‌టించార‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -