Friday, April 19, 2024
- Advertisement -

ఒక భాయ్.. ఒక గ్రీకువీరుడు.. ఒక మన్మధుడు 2

- Advertisement -

ఆల్రెడీ ‘దేవదాసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అక్కినేని నాగార్జున ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమాతో కూడా మరొక అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే ఆగస్టు 9న విడుదలైంది. విడుదలకు ముందు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా డిజాస్టర్ గా మారింది. విడుదలైన రెండు మూడు రోజులకే వసూళ్లు భారీగా పడిపోయాయి. ఇప్పటిదాకా ‘మన్మధుడు 2’ ఎక్కువ డబ్బులని కలెక్ట్ చేయలేక పోయింది.

వారాంతం అయినప్పటికీ ‘మన్మధుడు 2’ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం పెరగలేదు పైగా సెలవ రోజులలో కూడా సినిమా కి ఉన్న కలెక్షన్లు 50 శాతం తగ్గిపోవడం గమనార్హం. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు ఓవర్సీస్ లో కూడా ‘మన్మధుడు 2’ సినిమా ఏమంతా హడావిడి చేయడం లేదు. 600 వేల డాలర్లు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉన్న ఈ సినిమా ఇప్పటిదాకా వసూలు చేసింది చూస్తే కచ్చితం గా షాక్ అవ్వక తప్పదు. ఇక కలెక్షన్లు పెరిగే అవకాశం లేకపోవడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా డిజాస్టర్ అని తేల్చి చెబుతున్నాయి.

అందుకే నాగార్జున కూడా ఈ సినిమా ని ఒక భాయ్, ఒక గ్రీకువీరుడు, ఒక మన్మధుడు 2 అని మర్చిపోవాలని నిర్ణయించుకున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -