రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరువు హత్యలపై స్పందించారు టాలీవుడ్ కింగ్ నాగర్జున. ఫలానా వ్యక్తితో తన మిగతా జీవితం సాగాల్సిందేనని పిల్లలు బలంగా చెప్పినప్పుడు వినాలే కాని ,ఇలా పరువు పేరుతో హత్య చేయడం సరికాదని నాగ్ అన్నారు. అలాగని ప్రేమ పేరుతో ఆత్మహత్యలకు పాల్పడడం కూడా తప్పని చెప్పారు.పిల్లలు కూడా తమ ప్రేమ విషయంలో తల్లిదండ్రులను ఒప్పించే దిశగా ఆలోచించాలని చెప్పారు నాగ్.
చిన్నప్పుడు పిల్లలకు నచ్చిన బొమ్మలు కొనిపెడతామని ఊహ తెలిశాక నచ్చిన డ్రెస్సులు కొనిపెడతామని కెరీర్ పై నిర్ణయాలను వారికే వదిలేస్తామని చెప్పారు. జీవితం గురించి తెలిసిన పిల్లలు వాళ్ల లైఫ్ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోగలరని -మనం చూసిపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. మిగతావన్నీ వాళ్లకు నచ్చినవే చేసి లైఫ్ పార్ట్నర్స్ని మాత్రం మనకు నచ్చినట్లు సెలెక్ట్ చేయాలనడం సరికాదన్నారు.