Thursday, April 25, 2024
- Advertisement -

నాగార్జున కామెంట్స్ పై ఫైర్ అవుతున్న తమ్మారెడ్డి భరద్వాజ్

- Advertisement -

బోలెడు వివాదాల మధ్యలో బిగ్ బాస్ మూడవ సీజన్ ఎట్టకేలకు మొదలైంది. ఈ ఆదివారం తో బిగ్ బాస్ రెండు వారాలు పూర్తి చేసుకోబోతోంది. కింగ్ నాగార్జున బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ ఫిలింమేకర్ తమ్మారెడ్డి భరద్వాజ్ నాగార్జున మరియు బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 3 ప్రీమియర్ అప్పుడు నాగార్జున మాట్లాడుతూ “మా నాన్నగారు బతికున్నప్పుడు మా కుటుంబంలోని 30 మందిని ప్రతి ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఒక చోట కలిసేలా చేసేవారు. మరి ఇప్పుడు ఈ 15 మంది బిగ్ బాస్ హౌస్ ఒక కుటుంబంలా ఎలా ఉండబోతున్నారో చూద్దాం” అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ నాగార్జున కామెంట్స్ వ్యతిరేకించారు. ఏఎన్ఆర్ గారు బాలీవుడ్ లో ఒక లెజెండరీ నటుడని అలాంటివారిని బిగ్ బాస్ షో తో పోల్చడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. “కుటుంబంలో అందరూ ఒకటిగా ఉండాలని ఆయన అందరినీ ఒక చోటకి పిలిపించేవారు. కానీ బిగ్ బాస్ మొత్తం డబ్బులు మరియు గెలవటం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏఎన్నార్ లాంటి మనిషిని బిగ్ బాస్ తో పోల్చడం ఏమాత్రం బాగాలేదు” అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. అంతేకాకుండా ఇకమీదట అయినా నాగార్జున ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకపోతే బాగుంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -