ప్రపంచం మొత్తం లైంగిక వేధింపుల చూట్టునే తిరుగుతుంది.ఇప్పటికే పలువురు మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా మహిళల వేధింపుల గురించి మాట్లాడతు వారికి మద్దతుగా నిలిచింది డైరక్టర్ నందిని రెడ్డి.అలా మొదలైంది ,జబర్దస్త్ ,కళ్యాణవైభోగమే వంటి సినిమాలతో మంచి దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది నందిని రెడ్డి.అయితే ఆమె సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది నందిని రెడ్డి.కెరీర్ స్టార్టీంగ్లో నందిని క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దగ్గర పనిచేసింది. మురారి షూటింగ్ సమయంలో కృష్ణవంశీతో గొడవైన విషయం గురించి ప్రస్తావించింది నందిని రెడ్డి.. మోకాళ్ల మీద ఉండి మహేష్ బాబును చూస్తూ సోనాలి బింద్రే కొంగు తీయాలి.
అయితే కృష్ణవంశీ గారికి అది చెప్పడం రాక నన్ను పిలిచి షాట్ గురించి చెప్పమన్నారు. నేను చెప్పనని అన్నా. అప్పుడు ఆయన చెప్తావా? లేదా అని నాపై గట్టిగా అరీచేశారు. దీంతో అమ్మాయిలే ఎందుకు అలా అడగాలి అనడంతో నా సర్వస్వం నీకే అర్పిస్తున్నా అని మీనింగ్ తెలుపడానికి అలా చేయాలనీ కృష్ణవంశీ చెప్పారు. నేను కోపంతో.. అయితే అలాంటప్పుడు అబ్బాయిలు సర్వస్వం ఇవ్వాలంటే ప్యాంట్ విప్పుతారా? అని అనేశాను. అప్పుడు కృష్ణవంశీ గారు మరింత కోపంతో వెళ్లి నేను చెప్పింది చెప్పు,కాళ్లు విరగ్గొడతా అనగానే ఏమనకుండా వెళ్ళిపోయా అంటూ చెప్పుకొచ్చింది నందిని రెడ్డి.