Wednesday, April 24, 2024
- Advertisement -

టబు స్థానం లో అవార్డ్ విన్నింగ్ నటి

- Advertisement -

కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మనకి అందిస్తున్న హీరోలలో రానా దగ్గుబాటి ఒకరు. ఈ మధ్యనే రానా దగ్గుబాటి వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరట పర్వం’ అనే సినిమా కి సైన్ చేశారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలోని నక్సలైట్ బాస్ పాత్ర కోసం ముందుగా టబు ని అనుకున్నారు కానీ డేట్స్ కుదరక పోవడం వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది.

ఈ సినిమా పూర్తయిన తర్వాత టబు మళ్లీ బాలీవుడ్ లో నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు టబు స్థానంలో అవార్డ్ విన్నింగ్ నందిత దాస్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. ‘అమృత’ సినిమాలో ఎల్ టి టి ఈ రెబల్ పాత్ర పోషించిన నందితా దాస్ తన నటనతో అందరినీ మెప్పించింది. ‘1947 ఎర్త్’, ‘ఫైర్ అండ్ కమ్లి’ వంటి సినిమాలులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టి ఆకర్షించిన నందితా దాస్ ఇప్పుడు తెలుగులో రానా తో నక్సలైట్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -