Saturday, April 20, 2024
- Advertisement -

హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోద…విచారించనున్న పోలీసులు

- Advertisement -

నార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్డులో కారు ప్రమాదం తర్వాత నటుడు రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే మరుసటి రోజు ప్రమాదంపై ట్విట్టర్ లో స్పందించారు.ఆటోమేటిక్ గేరు ఉన్న కారు కావడంతో సాంకేతికంగా ఎలా నడపాలో తెలియక.. వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు స్పీడ్ గా వెళ్లి డివైడర్ ని ఢీకొట్టడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రాజ్ తరుణ్ స్పందించి తనకు యాక్సిడెంట్ జరిగిన విధానాన్ని వెల్లడించాడు. ఇదలా ఉంటె రాజ్ తరుణ్ పై కేసు నమోదయ్యింది.ఇన్‌స్పెక్టర్‌ రమణగౌడ్‌ మాట్లాడుతూ హీరో రాజ్‌తరణ్‌ ట్విట ద్వారా స్పందించడంతో అతడికి నోటీసులు అందించి విచారించనున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -