న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన గత సినిమా లు అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నాడు నాని.. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోయినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మూవీ టీమ్ చిత్రీకరణ చేశారు.. అయితే యూనిట్ లోని ఒకరికి కరోనా సోకడంతో ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇక ఈ సినిమా తో పాటే నాని శ్యామ్ సింగ్ రాయ్ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు.. విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్ ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. దాంతో ఈ సినిమా ని నాని వేరే నిర్మాత కు అప్పగించాడు.. కరోనా కారణంగా నాని మార్కెట్ పై ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు.. హీరోగా ఒక రేంజ్కి చేరుకున్న దశలో తన సినిమాల బడ్జెట్ పరంగా నాని చాలా జాగ్రత్తగా వుండేవాడు. తన పారితోషికం పెరిగినా కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పరంగా అన్ని సినిమాలు ఒకే రేంజ్లో వుండేట్టు చూసుకునేవాడు.
కానీ ఇప్పుడు నాని సినిమాల బడ్జెట్ కంట్రోల్లో వుండడం లేదు. ‘వి’ చిత్రానికి భారీగానే ఖర్చయింది. అంతకుముందు గ్యాంగ్లీడర్, దేవదాస్ చిత్రాలకు కూడా ఓవర్ బడ్జెట్ అయింది. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి కూడా బడ్జెట్ నలభై కోట్లు పైగానే అవుతుందనే అంచనాలతో ఆ చిత్రాన్ని నిర్మించాలనుకున్న సూర్యదేవర నాగవంశీ ఇటీవలే తప్పుకున్నాడు. ఆ చిత్రాన్ని నాని మరో నిర్మాత చేతుల్లో పెట్టాడు. మరి నాని రేంజ్ ఇప్పుడు ఓ రేంజ్లోనే ఉన్నా ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా నాని బడ్జెట్ ని తగ్గించి సినిమాలు చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.
చిరంజీవి కి ఈ అరవ కథల మోజేంటి..?
నాని సినిమా కి కరోనా బ్రేకులు.. ఇప్పుడెలా..