Friday, March 29, 2024
- Advertisement -

నయనతార గేమ్ తాప్సీ ఆడేసిందే

- Advertisement -

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరని తెలిసిందే. పోస్టర్ పై నయనతార ఫోటో ఉంటే చాలు ప్రేక్షకులు టికెట్ కౌంటర్ల వద్ద క్యూలు కడతారు. దీంతో దాదాపు అందరూ దర్శక నిర్మాతలు లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే నయనతార మీదే మొగ్గు చూపుతారు. అలానే మొదట తాప్సీ హీరోయిన్ గా ఈ మధ్యనే విడుదలైన ‘గేమ్ ఓవర్’ సినిమా లో కూడా ముందు నయనతారనే నటించాల్సి ఉందట. నిజానికి నయనతారతో ఈ సినిమా మూడు రోజుల షూటింగ్ కూడా జరిగిందట. కానీ అదే సమయంలో కథ గురించి పేచీ మొదలైంది.

కధ లైను ఒక హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్నారని రచయితకి చిత్రబృందానికి మధ్య గొడవలు వచ్చాయట. అందుకని అనుకోకుండానే ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత తాప్సి వద్దకి వెళ్లగా ఆమె వెంటనే సినిమా సైన్ చేసేసింది. అప్పుడే కథలో టాటూ ఎపిసోడ్ వంటివి జత చేయడం జరిగింది. ఇలా నయనతార చేతిలోంచి జారి ‘గేమ్ ఓవర్’ సినిమా చేతుల్లోకి వెళ్లింది అన్నమాట. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా నిన్న జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -