Thursday, April 25, 2024
- Advertisement -

మంచు లక్ష్మి పోవే అన్న నేటిజన్.. ఏం జరిగింది ?

- Advertisement -

మంచు లక్ష్మీ డైలాగ్స్ సోషల్ మీడియాలో ఏ రెంజ్ లో వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యాస, బాడీ లాంగ్వేజ్ ను ఇమిటేట్ చేస్తూ చాలా మంది వీడియోలు చేస్తుంటారు. అలానే మంచి లక్ష్మీ పై మీమ్స్ కూడా బానే వస్తుంటాయి. ఆమె మాట్లాడే ఇంగ్లీష్ తీరుపై చాలా వీడియోలు ఇప్పటికే ట్రోల్ అయ్యాయి.

అయితే ఈసారి విభిన్నంగా మంచు లక్ష్మి బుక్ అయ్యింది. అమ్మ నాకు మల్లె పూవ్వులు పెడుతుంది అంటూ ఫొటోను పోస్ట్ చేసింది. అయితే మల్లె ను ఇంగ్లీష్ లో మాలి అంటూ రాసింది. తెలుగు సరిగా మాట్లాడటమే కాదు.. తెలుగును కనీసం ఇంగ్లీష్ లో అయినా సరిగా రాయలేవా అంటూ నెటిజనలు ఆమెను ట్రోల్ చేశారు. ఆవారా అనే ట్విట్టర్ అకౌంట్ హోల్డర్.. మాలి కాదు అది మల్లె అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. అయుతే అతడి ట్వీట్ ను ఫన్నీగా తీసుకుందో లేక సీరియస్ గా తీసుందో కానీ అతడిని పో బే అంటూ స్పందిస్తూ కామెంట్ చేసింది.

ఆమె కామెంట్స్ పై అతడు ప్రతి గా స్పందిస్తూ ’పో వే’ అంటూ కామెంట్ చేశాడు. వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అతడు ఎలాంటి బూతు లేకుండా అది మాలి కాదు మల్లె అంటూ చెప్పినా కూడా పో బే అంటూ మంచు లక్ష్మి సీరియస్ అవ్వడం సరిగా లేదంటూ చాలా మంది ఆమె తీరును తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో మంచు లక్ష్మీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆవారా ‘పోవే’ అన్న తర్వాత మళ్లీ మంచు లక్ష్మి మళ్లీ స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -