Friday, April 19, 2024
- Advertisement -

కాజ‌ల్‌ను అక్క‌డ ట‌చ్ చేస్తే వారికేం భాదో..!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగార్వాల్ తాజాగా న‌టించిన చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. బాలీవుడ్ క్వీన్ సినిమాకు ఇది రీమేక్‌. తెలుగులో త‌మ‌న్నా న‌టించగా,క‌న్న‌డ‌లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ అంద‌రు ఆక‌ట్టుకునే విధాంగా ఉంది. అయితే ఈ ట్రైల‌ర్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. దీనికి కార‌ణం ట్రైల‌ర్‌లోని ఓ సీన్. ట్రైల‌ర్‌లో కాజ‌ల్ అసభ్యకర సన్నివేశంలో న‌టించింది.

ట్రైలర్‌లో కాజల్ ప్రైవేట్ పార్ట్‌ను టచ్ చేస్తుంది మ‌రో న‌టి. ఇక్క‌డే మొద‌లైంది అస‌లు వివాదం. తెలుగులో ఇలాంటి సీన్ లేనప్పుడు తమిళంలో ఎందుకు పెట్టారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఇలాంటి సీన్స్‌లో నటించాల్సిన అవసరం ఏమోచ్చిదంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై కాజ‌ల్ ఇప్ప‌టి వ‌రకు స్పందిచ‌లేదు.

తాజాగా ఈ వివాదంపై చిత్ర ద‌ర్శ‌కుడు రమేష్ అరవింద్ స్పందించారు. ట్రైల‌ర్‌లో చూసే స‌రికి మీకు ఆ సీన్ అలా అనిపిస్తుంది కాని, సినిమాలో ఈ సీన్‌కు ముందు త‌రువాత ఏంటో తెలిస్తే మీరు ఇలా కామెంట్స్ చేయ‌ర‌ని అంటున్నాడు. ఏది ఏమైనప్ప‌టికి కాజ‌ల్ ఇలాంటి సీన్స్ చేయ‌కుండా ఉంటే మంచిద‌ని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -