తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ రెండో సీజన్లో విన్నర్గా నిలిచాడు టీవీ ఆర్టిస్ట్ కౌశల్. ఈ సీజన్ మొత్తం ఎలిమినేట్లో ఉన్న కూడా తనకున్న అభిమాన బలంతో టైటిల్ను గెలిచాడు కౌశల్. ఇప్పుడు ఆ అభిమానులలో కొందరు అతనిపై తిరగబడి, విమర్శలు చేస్తున్నారు. కౌశల్ ఫౌండేషన్లో అభిమానులు ఇచ్చిన డబ్బులను కౌశల్ తన వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కాని ఈ గొడవను కొన్ని మీడియా ఛానెల్స్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.
ఓ ఛానెల్ కౌశల్కు వ్యతిరేకంగా ఉంటే, మరో ఛానెల్ మాత్రం కౌశల్కు సపోర్ట్ చేస్తోంది. ఈ రెండు ఛానెల్స్ కౌశల్ గొడవను క్యాష్ చేసుకుంటున్నాయి అని చాలామంది అభిప్రాయడపడుతున్నారు. టీవీ స్టూడియోలో గంటలకుపైగా వీరిపై డిబేట్ నడుపుతు ప్రేక్షకులను విసిగిస్తున్నారు. అవతల ఇండియా- పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత వాతవారణం చోటు చేసుకున్న ఈ తరుణంలో , వీరు ఓ పౌండేషన్లో వచ్చిన చిన్న సమస్యను ఇలా పెద్దదిగా చూపించడం ఏంటీ అని చాలామంది ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ వివాదానికి ముగింపు పలుకుతానని మరో న్యూస్ ఛానెల్ వచ్చింది. కౌశల్, వారి అభిమానులకు మధ్య గొడవ సర్థుమణింగిందని ఈ ఛానెల్ ప్రకటించడం చూస్తుంటే అందరికి నవ్వుస్తోంది. అస్సలు మిమ్మల్ని ఎవరు గొడవ గురించి డిబేట్లు పెట్టమన్నారు, దీనిపై ఎవరు చర్చించమన్నారు.
ఇవి ఏమి పట్టించుకోకుండా కౌశల్ గొడవను తమ స్వార్థానికి వాడుకున్నాయి ఈ న్యూస్ ఛానెల్స్. కనీసం బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అవగాహన లేకుండా వారి రేటింగ్స్ కోసం ఇలా దిగజారడం చూసి టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడు నవ్వుకుంటున్నారు. అసలు ఇండియాకు ఒక్క ఆర్మీనే ఉంటుంది, అది ఇండియన్ ఆర్మీ. ఇలా తన పేరుకు ముందు ఆర్మీ పెట్టుకున్న కౌశల్ను ఎవరు దీనిపై ప్రశ్నించలేదంటే అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికి ఓ సంస్థలో అనేక గొడవలు ఉంటాయి. వాటిని ఇలా పబ్లిసిటీ చేసి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.
- Advertisement -
కౌశల్ గొడవను ఆ ఛానెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయిగా..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -