Thursday, April 25, 2024
- Advertisement -

పెద్దన్న సినిమా తర్వాతే నా సినిమా అంటున్న నిఖిల్

- Advertisement -

నిఖిల్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సెట్స్ పైకి వెళ్లి చాలా కాలం అయింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కణితన్’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతకుముందు నిఖిల్ హీరోగా నటించిన ‘కిరాక్ పార్టీ’ సినిమా విడుదలై 16 నెలలు అయింది కానీ ‘అర్జున్ సురవరం’ మాత్రం ఇంకా విడుదల కాలేదు. విడుదల తేదీని దర్శక నిర్మాతలు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని నిఖిల్ ని డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ఈ విషయమై ప్రశ్నించాడు. ‘కిరాక్ పార్టీ’ సినిమా విడుదల చాలా కాలం అయింది. ‘అర్జున్ సురవరం’ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుంది అని అడిగాడు.

ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు నిఖిల్. “ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు సినిమా చాలా బాగుంటుందని, పెద్దన్న ప్రభాస్ ‘సాహో’ సినిమా విడుదల తర్వాత ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. నిజానికి ‘సాహో’ ఆగస్టు 15న విడుదల కావాలి. అప్పుడు ‘అర్జున్ సురవరం’ సినిమాని ఆగస్టు 30న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ‘సాహో’ విడుదల ఆగస్టు 30 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అర్జున్ సురవరం’ సినిమా కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. మరి ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. లావణ్య త్రిపాటి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -