Thursday, March 28, 2024
- Advertisement -

మహానటి తో ఇష్క్ అంటున్న నితిన్

- Advertisement -

వెంకీ అట్లూరి హీరో గా సినిమా పరిశ్రమ లో రంగ ప్రవేశం చేసి ఆ పైన, మెల్లగా పరిశ్రమ లో డైరెక్టర్ గా ఎదిగాడు. మొదటి సినిమా తొలిప్రేమ తో అందరినీ ఎంతగానో ఇంప్రెస్ చేసిన ఈ దర్శకుడు రెండో సినిమా మిస్టర్ మజ్ను తో మాత్రం కనీసం అంటే కనీసం కూడా మెప్పించే ప్రయత్నం చేయలేకపోవడం బాధాకరం. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయనున్నాడు. మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగు లో చాలా తక్కువ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడితో, మరొకటి నగేష్ కుకునూర్ దర్శకత్వం లో మరొక చిత్రం లో తప్ప ఇంకా ఏ సినిమా ని ఒప్పుకోలేదు.

కాకపోతే ఇటీవలే వెంకీ చూపిన ఒక కథ కీర్తి ని ఎంతగానో మెప్పించింది అని టాక్. ఈ కథ తో పాటు నిర్మాతలు ఇవ్వనున్న పారితోషికం కూడా కీర్తి ని మెప్పించడం తో సినిమా కి కాల్ షీట్స్ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది కీర్తి. ఈ సినిమా లో కీర్తి సరసన నితిన్ హీరో గా నటించనున్నాడు అని టాక్ నడుస్తుంది. అయితే ఈ వార్త ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వం లో భీష్మ అనే చిత్రం తో బిజీ అవ్వనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -