మహనటి సావిత్రి జీవిత కథను సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.సావిత్రి పాత్రలో కనిపించి మెప్పించింది కీర్తి సురేష్.సావిత్రి మళ్లీ పుట్టిందా? అనే అంతాలా నటించింది కీర్తి సురేష్.మరి అలాంటి సావిత్రి పాత్రలో మరో హీరోయిన్ ఊహించుకోవడం కష్టమే అని చెప్పాలి.అయితే సావిత్రి పాత్రకు నేను రెడీ అంటోంది నిత్యామీనన్.అసలు మొదట మహనటి సినిమాలో కీర్తి ప్లేస్లో నిత్యానే మొదట సంప్రదించారట దర్శక-నిర్మాతలు.కారణం తెలియదు కాని మహనటి సినిమాలో నిత్యాకు బదులుగా కీర్తిని తీసుకున్నారు.అయితే ఇప్పడు నిత్యా మీనన్కు మళ్లీ సావిత్రి పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.
ఎన్ఠీఆర్ జీవిత కథను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమాలో సావిత్రి పాత్ర కోసం నిత్యా మీనన్ సంప్రదించాడటా దర్శకుడు క్రిష్.నిత్యా మీనన్ కూడా సావిత్రి పాత్రకు సై అందని తెలుస్తుంది.త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని చెబుతున్నారు. మరో వైపున చంద్రబాబు నాయుడిగా రానా లుక్ .. ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ను వదిలారు. శ్రీదేవి పాత్రకి గాను రకుల్ ప్రీత్ ను తీసుకున్న ఈ సినిమా టీమ్,సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.