Wednesday, April 24, 2024
- Advertisement -

మరో మెగా హీరోతో రొమాన్స్ చేయబోతున్న నివేదపేతురాజ్

- Advertisement -

‘మెంటల్ మదిలో’ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదపేతురాజ్ తాజాగా ‘చిత్రలహరి’ అనే సినిమాతో మరో హిట్ ను అందుకుంది. ఇక త్వరలో ‘బ్రోచేవారెవరురా’ అనే సినిమాలో కనిపించబోతున్న ఈమె తాజాగా స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే చాలా పేర్లు బయటకు వచ్చాయి కానీ ఆఖరికి దర్శక నిర్మాతలు నివేదపేతురాజ్ ని ఫైనలైజ్ చేశారట.

ఈ రోజు నుంచే ఈ బ్యూటీ షూటింగ్ సెట్లో కూడా అడుగుపెట్టబోతోంది. ‘చిత్రాలహరి’ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన నివేదా పేతురాజ్ ఇప్పుడు మళ్లీ మరో మెగా హీరో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత మూడవ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -