నటుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రా ఎన్నికలలో పోటీ చేయడం లేదని అందరికి తెలిసిందే. ఎన్నికలకు తగినంత సమయం లేకపోవడంతోనే తెలంగాణలో పోటీ చేయడం లేదని వివరణ ఇచ్చారు పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన కార్యకర్తలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయండంటూ పిలుపునిచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని పవన్ కల్యాణ్కు వచ్చే ఎన్నికలలో ఆయన ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్క ఓటు కూడా సాధించలేరని తెలుస్తుంది. పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయలపై దృష్టి సారించారు. దీంతో ఆయన అక్కడ నుంచే పోటీ చేయనున్నారు. కాని మెగా ఫ్యామిలీలో ఒక్కరికి కూడా ఏపీలో ఓటు హక్కు లేదు.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఓటింగ్లో మెగా ఫ్యామిలీ మొత్తం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి దగ్గర నుంచి నాగబాబు,అల్లు అర్జున్,వరుణ్ తేజ్ ,నిహారికలతో పాటు వారి ఫ్యామిలీకి చెందిన మిగత వారు కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. దీంతో వీరికి ఏపీలో ఓటు హక్కు లేదని స్పష్టం అయింది. పవన్ మీద అంత ప్రేమే ఉంటే వీరు తమ ఓటును ఏపీకి బదిలీ చేసుకునే వారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఫ్యామిలీ నుంచే ఒక్క ఓటు సాధించలేని పవన్, ప్రజల నుంచి ఓట్లు ఎలా సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు.