దర్శకుడు సుకుమార్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే. రంగస్ధలం వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సుకుమార్ మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థతో కలిసి మహేశ్ బాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే చివరి నిమిషంలో వీరి సినిమా క్యాన్సిల్ అయింది. కథ నచ్చకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు మహేశ్ బాబు. ఇలా సడన్గా మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకోవడంతో సుకుమార్ అహం దెబ్బతింది. దీంతో వెంటనే బన్నితో తన సినిమాను హడావిడిగా ప్రకటించాడు. అయితే మొదట బన్నితో కాకుండా ఎన్టీఆర్తో సినిమా చేద్దామని ప్లాన్ చేశాడట సుకుమార్.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మహేశ్తో సినిమా క్యాన్సిల్ అయిన వెంటనే ఎన్టీఆర్తో సినిమా చేద్దామనుకున్న సుకుమార్కు ఝలక్ ఇచ్చాడు తారక్. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయి విడుదల కావడానికి ఏడాదికి పైగా పడుతోంది. అప్పటి వరకు సుకుమార్ను వెయిట్ చేయమని చెప్పి తప్పించుకున్నాడట ఎన్టీఆర్. నిజానికి సుకుమార్ చెప్పిన కథ తారక్ను కూడా మెప్పించలేకపోయిందని టాక్. అందుకనే సైలెంట్గా సుకుమార్ను పక్కకు పెట్టాడని టాక్ వినిపిస్తోంది. మొత్తనికి మహేశ్ బాబు, ఎన్టీఆర్లు రిజెక్ట్ చేసిన కథను బన్ని చేస్తున్నాడు.
- Advertisement -
ఎన్టీఆర్ కూడా సుకుమార్ను రిజెక్ట్ చేశాడా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -