యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అరవింద సమేత.రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్,సాంగ్స్కు సూపర్ రెస్పన్స్ వచ్చింది.ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందు నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుక తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అక్టోబర్ 1 లేదా 2వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ నిర్వహిస్తారు, ముఖ్య అతిథిగా ప్రముఖులెవరైనా వస్తున్నారా? అనే విషయాల గురించి ఇంకా తెలియలేదు. సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్స్గా నటిస్తున్నారు.జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాత ప్రకటించిన సంగతి తెలిసిందే.