Wednesday, April 24, 2024
- Advertisement -

ఆ బూతు సినిమా ముందు బాల‌య్య సినిమా నిల‌బ‌డ‌గ‌ల‌దా..?

- Advertisement -

తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను ఆయన త‌న‌యుడు హీరో బాల‌కృష్ఱ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ఆయ‌నే ఎన్టీఆర్ రోల్‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. సినిమా మొద‌ట పార్ట్ క‌థానాయ‌కుడు ఈ సంక్రాంతికి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. సినిమాలో బిల్డ‌ప్ షాట్స్ త‌ప్ప మ‌రోక‌టి లేద‌ని ప్రేక్ష‌కులు తెల్చేశారు.చ దీంతో రెండో పార్ట్‌పై ఒత్తిడి పెరిగింది. రెండో పార్ట్ మ‌హనాయ‌కుడులో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితానికి సంబంధించిన స్టోరీ ఉంటుంది. కాబ‌ట్టి సినిమాను చాలా ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకుని తెర‌కెక్కించారు. మొద‌టి పార్ట్ ప్లాప్ అవ్వ‌డంతో రెండో పార్ట్‌లో కొన్ని మార్పులు చేశారు.

ఈ మ‌ధ్య‌లో వ‌చ్చిన యాత్ర సినిమా మంచి విజ‌యం సాధించింది. మాజీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవిత క‌థ‌లోని ప్ర‌ముఖ ఘ‌ట్ట‌మైన పాద‌యాత్ర ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. దీంతో మ‌హ‌నాయ‌కుడుపై మ‌రింత ఒత్తిడి పెరిగింది. ఇది చాల‌ద‌న్న‌ట్లుడ‌గా మ‌హ‌నాయ‌కుడుకు పోటీగా ఓ బూతు సినిమా విడుద‌ల అవుతుంది. బూతు సినిమాకు బాల‌య్య సినిమాకు పోలిక ఎక్క‌డ అనుకుంటే పొర‌పాటే, ఎందుకంటే ఈ సినిమా ట్రైల‌ర్ యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. డబుల్ మీనింగ్ డైలాగులతో హాట్ సీన్స్ గట్టిగా ఉన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ 3 మిలియన్ వ్యూప్స్ దాటేసి సినిమాపై అంచ‌నాల‌ను విప‌రీతంగా పెంచేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌కు వ‌చ్చిన సగం వ్యూస్ కూడా బాల‌కృష్ష సినిమాకు రాలేదు. మ‌రి ఈ బూతు సినిమాను త‌ట్టుకుని బాల‌య్య ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. ఈ రెండు సినిమాలు ఈ నెల 22న విడుద‌ల కాబోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -