టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ నెల(మే) 20వ తేదీన 36వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో పుట్టిన రోజు వేడుకులను రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి ఆయన అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. అభిమానులకు జూనియర్ నుంచి ఊహించని పరిణామం ఎదురయ్యింది.
అయితే ఈ సారి ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకులను జరుపుకోవట్లేదు. అంతేకాదు తన పుట్టినరోజు వేడుకులను అభిమానులు కూడా జరుపుకోవద్దు అంటూ అభిమానులకు సందేశం విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండడానికి కారణం లేకపోలేదు.
గత ఏడాది ఆగస్టు 29వ తేదీన హరికృష్ణ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు కారును స్వయంగా డ్రైవ్ చేసుకుని వెళ్తున్న సమయంలో నల్గొండ సమీపంలోని నార్కేట్పల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో అక్కడికక్కడే హరికృష్ణ మృతి చెందారు. తండ్రి చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం తారక్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.