Thursday, March 28, 2024
- Advertisement -

అల…. వైకుంఠపురములో.. సినిమా చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే ?

- Advertisement -

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం. మరోకటి అల్లు అర్జున్ నటించిన అల… వైకుంఠపురములో. ఈ రెండూ సినిమాలు ఊహించని విజయం సొంతం చేసుకున్నాయి. ప్రధానంగా ఈ సినిమాల గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ సినిమాల గురించే చర్చిస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్ అల… వైకుంఠపురములో చిత్రంపై అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయం తెలిపారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తిరుగులేని పెర్ఫార్మెన్స్ కనబర్చాడని కితాబిచ్చారు. ఎంతో సునాయాసంగా హిట్ కొట్టాడని అభినందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. “కంగ్రాట్స్ బావా… అల… వైకుంఠపురములో చిత్రం అదిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మాటలు రాశారు… కంగ్రాట్స్ స్వామీ” అంటూ ట్వీట్ చేశారు.

“మురళీశర్మ గారి నటనకు హ్యాట్సాఫ్. క్యారెక్టర్ రోల్ ను పండించారు. తమన్ ఇచ్చిన సంగీతం అమోఘం. ఈ సినిమాకు ప్రధానబలం సంగీతమే. పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు యావత్ చిత్రబృందానికి శుభాభినందనలు” అంటూ తారక్ తన అభిప్రాయాలు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -