Thursday, April 25, 2024
- Advertisement -

ముగ్గురు నిర్మాతల మధ్య ఇరుక్కున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

పవన్ కళ్యాణ్ మెల్ల మెల్లగా సినిమాల వైపుకు ఆకర్షితులు అవుతున్న సంగతి మనం అందరం గమనించవచ్చు. ఆయన సై రా నరసింహ రెడ్డి అనే సినిమా కి వాయిస్ ఓవర్ ఇస్తున్న దగ్గర నుంచి ఆయన సినిమాల వైపు కి మళ్ళీ అడుగు లు వేస్తున్నారు అనేది క్లియర్ గా అర్ధం అవుతుంది మనకి.

ఇకపోతే ప్రస్తుతం ఆయన ని ముగ్గురు నిర్మాతలు చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. ముగ్గురు నిర్మాతలు ఎలాగైనా సరే ఆయన తో సినిమా చేయాలి అనే తపన తో ఎదురు చూస్తున్నారట. ఈ ముగ్గురు నిర్మాతలు ఎవరు అంటే, ఏ ఏం రత్నం, దిల్ రాజు మరియు మైత్రి మూవీ మేకర్స్.

రత్నం తో ఖుషి కి పని చేసిన పవన్, అప్పటి నుంచి ఆయన తో సినిమా చేయాలని ఆశగా చూస్తున్నారు. ఆయన అంటే పవన్ కి కూడా ఎంతో గౌరవం. అది పక్కన పెడితే దిల్ రాజు కూడా అందరూ హీరోల తో పని చేశా కానీ పవన్ తో పని చేయలేదు అనే ఒక దిగులు తో ఎప్పటికప్పుడు ఆయన్ని అప్రోచ్ అవుతున్నారు. ఇక మైత్రి వాళ్ళ దగ్గర పవన్ అడ్వాంస్ కూడా తీసుకున్నారు.

పవన్ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తారు అని తెలుసుకొని ఈ ముగ్గురూ ఆయన మీద రోజూ ప్రెషర్ పెడుతున్నట్టు సమాచారం. మరి పవన్ ఎవరి మాట వింటాడు అనేది మనం వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -