Friday, April 19, 2024
- Advertisement -

పెయిడ్ అప్పీరన్స్ ఇస్తున్న జనసేన అధ్యక్షుడు

- Advertisement -

సినిమాలకి దూరమయ్యి రాజకీయాల వైపు ఆసక్తి చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే జనసేన అధ్యక్షుడిగా కంటే ప్రజలు పవన్ కళ్యాణ్ ని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో గా చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ లకి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవసరాల కోసం కొంత డబ్బులు కూడా సంపాదిద్దామని నిర్ణయించుకుని తన పబ్లిక్ అప్పీరన్స్ కి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తెలుగు వాషింగ్టన్ డీసీ లో జరిగిన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ వేడుకకి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ వేడుకకి చాలా మంది తెలుగు ఎన్నారైలు పవన్ కళ్యాణ్ స్పీచ్ వినడానికి తరలివచ్చారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు కాబట్టి మిగతా నటులు లాగా కాకుండా పవన్ మిగతా గెస్ట్ లాగా హాజరయ్యారని అందరూ అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం అది పెయిడ్ అప్పీరన్స్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తానా ఈవెంట్ కోసం ఏకంగా 50 వేల డాలర్లు పుచ్చుకున్నారట. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ మరియు ఇతర ఫెసిలిటీలు కూడా తీసుకుని వచ్చిన డబ్బుని పార్టీ ఫండ్ కి వాడారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ కి చాలా మంది ఎన్నారైలు మరియు ఆర్గనైజర్లు కూడా ముందుకు వస్తారని తానా పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -