Thursday, April 25, 2024
- Advertisement -

అల్లు హీరో సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్న మెగా హీరో

- Advertisement -

ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరోలతో ఓవర్లు తీసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ సినిమా కి స్వయంగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఒక మెగా హీరో సినిమా కోసం ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ నుంచి వాయిస్ ఓవర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ‘అలా వైకుంఠపురం లో’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే తెరపై కనిపించింది లేదు. కానీ ఈ వార్తే గనుక నిజమైతే అది మెగా అభిమానులకు శుభవార్త అవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఈ సినిమాపై కూడా క్రియేట్ చేస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, సుశాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -