పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా వేణు ఆతర్వాత రవితేజ తో ఓ సినిమా ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.. దాంతో కొంత టైం తీసుకుని బాలీవుడ్ లోని పింక్ సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అయితే ఈ కథను పవన్ కళ్యాణ్ చేయడం విశేషం..
తెలుగు నేటివిటి కి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గ మార్పులు చేసి ఈ సినిమా ని ఇక్కడ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.. ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే.. కరోనా వల్ల సినిమా దియేటర్స్ ఇంకా ఓపెన్ కాకపోవడంతో నిర్మాతలు ఎంతకొస్తే అంతకు OTT లకు అమ్మేస్తున్నారు.. ఇటీవలే నాని వి సినిమా అలా అమ్ముడుబోయింది..
కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్దడంతో నిర్మాతలు సైతం సినిమాలు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ను కూడా అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతునాయి. కానీ అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ ససేమీరా ఒప్పుకోలేదు.. ఇక లాక్ డౌన్కి ముందు 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు మళ్లీ షూటింగులకు సమాయాత్తం అవుతోంది. దసరా తరవాత వకీల్ సాబ్
కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కాబోతోంది. ఈ షెడ్యూల్ లో పవన్, శ్రుతిపై కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ పాటని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తోనే షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఇందుకోసం ఆర్.ఎఫ్.సీ లో ఓ సెట్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతికి వకీల్ సాబ్
ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
పవన్ ఫ్యాన్స్ ఊహించని గుడ్ న్యూస్..!
త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?