Friday, April 19, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ ఊహించని గుడ్ న్యూస్..!

- Advertisement -

కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని బంద్ అయిన విషయం తెలిసిందే. అయితే కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూన్న టాలీవుడ్.. నెమ్మదిగా షూటింగ్స్ ని మొదలు పెట్టింది. ఇప్పటికే చాలా సినిమాలు షూట్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ కూడా ఇప్పటికే తిరిగి ప్రారంభమైంది.

ఈ మూవీలో నటిస్తున్న అంజలి, నివేదా థామస్ లపై కీలక సీన్స్ దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్‌కళ్యాణ్ వంతు రావడంతో ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ దసర పండగ తర్వాత అంటే ఈ నెల చివరి వారంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గోనబోతున్నారట. దీంతో పవన్, శ్రుతిహాసన్‌పై సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఒక రకంగా ఇది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా.. హరిష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు.

కేజీఎఫ్ 2 పై ఓ రేంజ్ లో అంచనాలున్నాయిగా..?

విజయ్ తమ్ముడికి బాగానే ఖర్చు పెట్టారుగా..?

త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?

అల్లు అర్జున్ ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -