Friday, March 29, 2024
- Advertisement -

జేజమ్మ పాత్రలో ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ

- Advertisement -

స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటించిన మొట్టమొదటి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ‘అరుంధతి’. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అనుష్క కాదు ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ‘అరుంధతి’ సినిమాలో అనుష్క నటన తో పాయల్ రాజ్ పుత్ పోటీపడగలదా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అరుంధతి సినిమా హిట్ అవడానికి గల కారణాల్లో కథ, పశుపతి పాత్రలో సోనూసూద్ నటన, ఆ పాత్ర కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ ఇలా చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి.

కానీ ఈ సినిమాకి సీక్వెల్ అని చెప్పినా అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తప్ప హర్షించకపోవడం గమనార్హం. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో తన నటనతో పాయల్ రాజ్ పుత్ బాగానే మెప్పించింది. కానీ జేజమ్మ పాత్రలో నటించటం అంత సులువైన విషయం కాదని కొందరి వాదన. మరోవైపు భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా ని ప్యాన్ ఇండియన్ సినిమాగా మార్చాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఇప్పటిదాకా టాలీవుడ్లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న పాయల్ రాజ్ పుత్ కు ఈ సినిమా ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -