Thursday, April 25, 2024
- Advertisement -

హీరో నాగ‌ర్జున‌కు ట్విట్ చేసిన ప్ర‌ధాని మోదీ

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగ‌ర్జునకు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్విట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ధాని కార్య‌ల‌యం నుంచి సినీ ప్ర‌ముఖుల‌తో పాటు, పారిశ్రామిక వేత్తలకు పీఎం ఆఫీస్ ఓ ట్విట్ వ‌చ్చింది. దీని సారాంశం ఏంటంటే… కొన్నేళ్లుగా మీరు సినిమాల‌ను చేస్తు లక్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఎంతోమంది అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకున్న మీకు ఓ బాధ్య‌త‌ను అప్ప‌గిస్తున్నాను.

ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని కోరుతున్నాను అంటూ మోదీ నాగ‌ర్జున‌కు ట్విట్ చేశారు. తెలుగులో ఒక్క నాగ‌ర్జున‌కే మాత్ర‌మే ట్విట్ చేయ‌డం విశేషం. మోహ‌న్ లాల్‌, అనుష్క శ‌ర్మ‌, దీపిక ప‌దుకునే వంటి స్టార్స్‌కు కూడా మోదీ ట్విట్ చేశారు. ఇలా సెల‌బ్రిటీలు చేత ఓటు వేయండ‌ని చెప్పిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుంద‌ని మోదీ ఆలోచ‌న‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -